ఆ రియల్‌ హీరో ఎవరు?

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అత్తాపూర్‌లో బుధవారం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా రమేష్‌ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన తెలిసిందే. ఆ సమయంలో అక్కడ చాలామంది ఉన్నా.. అడ్డుకునేందుకు సాహసించలేదు.